ఆర్మూర్ టౌన్ : సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాల వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు నాంపల్లి, జిల్లా ఇన్చార్జి కొక్కెర భూమన్న మాదిగ, తదితరులు సోమవారం సీఎం కేసీఆర్ను హైదరాబాద్లో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీఎంతో భేటీ వివరాలను కొక్కెర భూమన్న మాదిగ మంగళవారం వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికిపైగా ఉన్న మాదిగలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పా రు. తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించిన విధంగానే, సమాజంలో వెనుకబడి ఉన్న మాదిగ, మాదిగ ఉప కులాలకు విముక్తి కల్పించాలని కేసీఆర్ను కోరినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని, సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఎస్సీల అభ్యున్నతికి వెచ్చిస్తామని చెప్పిన *50 వేల కోట్ల నుంచి మాదిగలకు 80 శాతం నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లో మాదిగ, ఉపకులాలకు ప్రత్యేక కోటా కేటాయించాలని, గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ పరీక్షల కోసం హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి, లిడ్ క్యాప్ ద్వారా మాదిగ యువకులకు ఉపాధి కల్పించాలని కోరినట్లు వివరించారు.
ఇల్లు లేని వారికి ప్రభుత్వమే గృహ నిర్మాణం చేపట్టాలని, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో జీవో అనుసరించి 25 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల ద్వారా బేషరతుగా రుణాలు ఇప్పించాలని కేసీఆర్ను కోరినట్లు భూమన్న తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ డప్పు చంద్రయ్య, నాయకులు మిట్టపల్లి విజయ, ఎర్ర రాంచందర్, సరికెల పోశెట్టి, సురేష్, రవి తదితరులు ఉన్నారు.
మాదిగలను అన్ని విధాలా ఆదుకోవాలి
Published Wed, Jun 25 2014 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement