స్థానికేతర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను సదరు విద్యార్థులకు నిలిపేసింది.ఫలితంగా తోటి విద్యార్థులంతా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందగా.. స్థానికేతర విద్యార్థులు మాత్రం నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,774 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా.. ఏకంగా ఈ పాస్ వెబ్సైట్లో వారి వివరాలను బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులు ప్రస్తుత కోర్సు ఫీజు చెల్లించే అంశంపై ఆందోళన చెందుతున్నారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు బ్రేకు
- వెబ్సైట్లో నిధుల బదలాయింపు ఆప్షన్ తొలగింపు
- నిలిచిన చెల్లింపులు రూ.50.76 కోట్లు
- ఫలితంగా 14,774 మంది విద్యార్థుల్లో ఆందోళన
- అయోమయంలో కళాశాలల యాజమాన్యాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్కు చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో జిల్లాలో రికార్డుస్థాయిలో వృత్తివిద్యా కళాశాలలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధికంగా జిల్లాలో పోస్టుమెట్రిక్ కాలేజీలుండడం.. అందులోనూ పేరున్న కాలేజీలున్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కొర్రీలు విధించింది. దీంతో కోర్సు మధ్యలో వదిలి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు, ఉపకారవేతనాల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన విద్యార్థులందరికీ ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసిన అధికారులు.. స్థానికేతర విద్యార్థులకు మాత్రం చెల్లింపులు నిలిపివేశారు.
రూ.50.76 కోట్లకు బ్రేక్
జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.2లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులున్నారు. వీరికి ఆయా సంక్షేమశాఖల ద్వారా ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ నిధులను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఫీజు బకాయిల పంపిణీకి ఉపక్రమించిన ప్రభుత్వం.. స్థానికేతర విద్యార్థులకు సంబంధించి నిధుల పంపిణీకి బ్రేకువేసింది. జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ విద్యార్థులు 11,254 మంది, ఈబీసీ విద్యార్థులు 3,250 మంది ఉన్నారు. వీరికి సంబంధించి రూ.50.76 కోట్ల బకాయిలను అధికారులు నిలిపివేశారు.
వెబ్సైట్లో బ్లాక్ చేసి..
ప్రభుత్వం పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియకు సంబంధించి వ్యవహారమంతా ఈ- పాస్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడంతో విద్యార్థులు తమ ఫీజు రాయితీ, ఉపకారవేతనాల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే, స్థానికేతర విద్యార్థుల వివరాలను ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు ఫీజు రాయితీ, ఉపకారవేతనాల చెల్లింపులు చేసే వీలు లేదు. దీంతో విద్యార్థుల ఈపాస్ స్టేటస్ సైతం కనిపించడం లేదని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ఫీజులు కట్టం!
Published Fri, May 15 2015 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement