సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా పాఠశాలలు మూసివేసే ప్రసక్తేలేదని, ఈ నిబంధన తొలగిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేషనలైజేషన్కు సవరణ చేస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో రేషనలైజేషన్ ఉత్తర్వులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 75 మంది లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను పక్కస్కూళ్లలో విలీనం చేసేలా విద్యాశాఖ జారీ చేసిన రేషనలైజేషన్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘా లు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (టీటీజేఏసీ), ఇతర సంఘాల నేతలు మంగళవారం జగదీశ్రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించి, స్కూళ్ల మూసివేత నిబంధనను తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలి సింది. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. నిబంధనలు సవరించి టీచర్ల రేషనలైజేషన్ వేసవి సెలవుల్లో చేపడతామన్నారు. స్కూళ్ల మూసివేత ప్రభుత్వ విధానం కాదన్నారు. గత ఏడాది బదిలీ అయినా, పాతస్థానాల్లోనే కొనసాగుతున్న టీచర్లను రిలీవ్ చేస్తే స్కూళ్లు మూతపడతాయనే ఉద్దేశంతోనే వారిని రిలీవ్ చేయలేదన్నారు. అలాంటిది ఇపుడు రేషనలైజేషన్ పేరు తో స్కూళ్లను ఎందుకు మూసివేస్తామన్నారు. ఉత్తర్వుల జారీ విషయంలో ఏదో జరిగిందని, దానిని వెంటనే సవరిస్తామన్నారు. గిరిజనతండాల్లో 10 మందే విద్యార్థులుంటారని, అక్కడ స్కూల్ మూసివేస్తే విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పారు. హేతుబద్ధీకరణ ఎప్పుడనేది విద్యాశాఖ నిర్ణయిస్తుందన్నారు. దీంతో సంఘాలకు సంబంధం లేదన్నారు. రేషనలైజేషన్ తర్వాతే ఎంతమంది కొత్తటీచర్లు అవసరమనేది తేలుతుందన్నారు. మంగళవారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి వికాస్రాజ్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్తో మంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. సవరణ ఉత్తర్వులు జారీ చేసి, ఇప్పుడే రేషనలైజేషన్ చేయాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. బుధవారం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జీవోనే ఇవ్వలేదన్నారు
ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27నే జీవో వచ్చిందని తాము పేర్కొనగా, స్కూళ్ల మూసివేత నిబంధనను తొలగిద్దామని మంత్రి చె ప్పినట్టు నేతలు వెల్లడించారు.
బడులు మూసివేయం
Published Wed, Oct 1 2014 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement