మరో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపు | Sakshi
Sakshi News home page

మరో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపు

Published Tue, Jan 13 2015 11:43 AM

secunderabad cantonment elections counting begins

కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. 2 వ వార్డు రసూల్ పుర లో టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై 1534 ఓట్ల ఆధిక్యంతో సదాకేశవ రెడ్డి విజయం సాధించారు. 1 వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర రెడ్డి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్ననానికి అన్ని ఫలితాలు వెలువడే అవకాశం.

ఉంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement