తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీసీ కెమెరాలను కొనుగోలుకు నిధులు కేటాయించింది. అన్ని జి ల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ జిఆ్లను అనుసంధానం చేసేలా రాజధానిలో ‘ఇంటిగ్రెటెడ్ మాస్టర్ కం ట్రోల్ రూం’ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని ఈ కంట్రోల్రూమ్తో ఇంటర్ లింక్ చేయనున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇక మాస్టర్ కంట్రోల్ రూంలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది. జిల్లాలో కూడా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కోరిన మేరకు ఎస్పీ నివేదిక పంపిం చారు. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రధాన రహదారులున్నాయి, ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుటుంది అనే వివరాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
అయితే తొలుత ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఎస్పీ ఉన్నారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వివరాలు పూర్తిగా సేకరించారు. బస్టాండ్ సెం టర్, శ్రీశ్రీ విగ్రహం వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ప లు వ్యాపార సంస్థలు కూడా తమ సముదాయాల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నాయి. నగరం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్పీ పంపిన ప్ర తిపాదనకు ఇప్పటికే కలెక్టర్ అంగీకరించారు.
నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు ఓ హత్య కేసులో కీలక నిందితుడిని పట్టించాయి. ఈ కేసులో పోలీసులకు సీసీ కెమెరాలు కీలకమయ్యాయి. గత కొన్నేళ్ల క్రితం ఖమ్మంలో చిన్నారులు కిడ్నాప్కు గురై దారుణహత్యకు గురయ్యారు. ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. అంతేకాకుండా పలు కేసులు పోలీసులకు అంతుచిక్కకుండా ఉన్నాయి.
తగిన ఆధారాలు లేకపోవడం ఒక కార ణం అయితే నిందితులు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఇది పోలీస్లకు సవాల్గా మారింది. ఇటీవల సీసీ కెమెరాల సహా యంతో గంటల్లోనే నిందితులను పోలీ సులు పట్టుకుంటున్నారు. ఖమ్మంలో ఈనెల 11న దారుణ హత్యకు గురైన బాలుడు నిషాంత్ హత్య కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ కేసులో బాలుడికి వరుసకు బాబా యి అయిన మధునే నిందితుడు కావడం గమనార్హం.
హత్య అనంతరం నిందితుడు ఎవరికి అనుమానం రాకుండా నటించాడు. అయితే బాలుడిని ఆస్పత్రి బయటి నుంచి కారులో బయటకు తీసుకెళ్లడంతో ఆస్పత్రి సీసీ కెమెరాలో మధు కారు నంబర్తో సహా నిక్షిప్తమైంది. ఇదే కారు వైరా రోడ్డులో సీసీ కెమెరాలో కూడా కనిపించడంతో అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అతన్ని విచారించడంతో బాలుడి హత్య ఉదంతం బయట పడింది. వారం రోజుల్లో ఈ కేసును ఛేదిస్తామని చెప్పిన పోలీసులు సీసీ కె మెరాల సహాయంతో 48 గంటల్లోనే ఛేదిం చారు. సీసీ కెమెరాల సహాయంతో ఒక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యం గుర్తించిన పోలీసుశాఖ దశల వారీగా జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
జిల్లా అంతటా కెమెరాల ఏర్పాటు
Published Wed, Sep 17 2014 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement