మహేశ్వరం: మండలంలో పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి గతంలో మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులు నిధులు కొరత, స్థల సేకరణలో జాప్యంతో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా 2012లో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
అలాగే మండల కేంద్రంలో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ డిపో, రూ.76 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.55 లక్షలతో ఫైర్స్టేషన్, రూ.65 లక్షలతో తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు గతంలో కొన్ని నిధులు మంజూరయ్యాయి. అయితే 2014లో ప్రభుత్వం మారినప్పటినుంచి వీటికి నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని భావించిన మండల ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
బంక్ లేక ఆగిన డిపో పనులు
మండల కేంద్రంలోని కేసీ తండా సమీపంలో సర్వే నెంబరు 306లో మాజీ హోంమంత్రి సబితారెడ్డి అప్పట్లో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. అయితే డి పోలో డీజిల్ ట్యాంకు పనులు అసంపూర్తిగా ఉ న్నాయి. దీంతో ఇక్కడినుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర, రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి ఈ డిపోను పరిశీలించారు. 2015లో డిపో నుంచి బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
అద్దె భవనంలో అగ్నిమాపక కేంద్రం
సబితారెడ్డి రూ.55ల క్షలు మంజూరు చేయించి మండలకేంద్రంలో ఫైర్ స్టేషన్కు అప్పట్లో శిలాఫలకం వేశారు. స్థలం ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విడుదలైన నిధులు తెలంగాణ ప్రభుత్వంలో నిలిచిపోయాయయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దె భవనంలో ఫైర్ స్టేషన్ కొనసాగుతోంది.
నిర్మాణానికి నోచుకొని జూనియర్ కళాశాల
మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్బంకు పక్కన అప్పటి కేంద్రమంత్రి ఎస్. జైపాల్రెడ్డి,సబితారెడ్డిలు కలిసి రూ.76 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థలం ఉన్నా కొత్త ప్రభుత్వంలో నిధులు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాల కొనసాగుతోంది.
100 పడకల ఆస్పత్రికి స్థలం కొరత
మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి సీఎం ఎన్. కిరణ్కుమార్రెడ్డి ఇందిరమ్మబాటకు వచ్చి 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ప నులకు టెండర్ పక్రియ పూర్తయింది. స్థలం లేదని అధికారులు పనులను నిలిపివేశారు. ప్రస్తు తం స్థలం చూపిస్తే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
అర్ధంతరంగా ఆగిపోయాయి..!
Published Wed, Nov 26 2014 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement