త్వరలో దళిత, గిరిజన గర్జన: ఉత్తమ్ | Sakshi
Sakshi News home page

త్వరలో దళిత, గిరిజన గర్జన: ఉత్తమ్

Published Wed, May 6 2015 6:43 PM

Soon , a Dalit , tribal void says tpcc uttam

నల్లగొండ: ‘టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నెల రోజుల్లో దళిత, గిరిజన గర్జన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 11 తేదీన సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు. మరుసటి రోజు 12 తేదీన ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement