జనగామలో రైతులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా ముఖాముఖి
జనగామ: ‘రైతులు పాలను సేకరిస్తారు. ఆ పాలతో మిఠాయిని తయారు చేస్తారు.. అలాగే, మీరిచ్చిన అమూల్యమైన సూచనలను మిఠాయిగా తయారు చేసి తీపి కబురును అందిస్తామని, ఇందుకోసం రైతు సమస్యలపై సమగ్ర నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తాను.’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో బుధవారం ఆయన ‘రైతులతో ముఖాముఖి’ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు దేశంలో దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. గరీబీ హఠావో అన్న కాంగ్రెస్ 45 ఏళ్ల పాలనలో రైతులకు కేవలం 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచిందని, 17 నెలల మోదీ హయూంలో జన్ధన్ యోజన పథకం కింద 20 కోట్ల ఖాతాలు అందించామని చెప్పారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపించాలని సూచించారు.
వసతులు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్
భువనగిరి: తెలంగాణకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి రూ.లక్ష కోట్లు ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని సూచించారు. మూసీ ప్రక్షాళన కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ బృందాన్ని పంపుతామని, వారి నివేదిక ఆధారంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలు సమకూరిస్తే తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చెప్పారు.
జికా మహమ్మరిని తరిమేద్దాం
మోత్కూరు: జికా మహమ్మారిని తరిమేద్దాం అని కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ మోత్కూ రు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను భువనగిరిలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. జికా వ్యాధి నివారణ కోసం ప్రజల్లో అవగాహన తెచ్చేలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
త్వరలో రైతులకు తీపి కబురు అందిస్తాం
Published Thu, Feb 11 2016 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement