యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన | Sakshi
Sakshi News home page

యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన

Published Fri, Apr 17 2015 5:28 PM

యాదగిరీశునికి సువర్ణ పుష్పార్చన

తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు సువర్ణ పుష్పార్చన ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పంచోపనిషత్తులు, పంచసూక్తాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement