* మలేసియా, సింగపూర్లకు ఐఆర్సీటీసీ ప్యాకేజీలు
* హైదరాబాద్, వైజాగ్ల నుంచి పర్యటించే సదుపాయం
హైదరాబాద్: భారతీయ రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీ టూర్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో థాయ్లాండ్ పర్యటనతో విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఐఆర్సీటీసీ ఈసారి మలేసియా, సింగపూర్ పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంల నుంచి ఈ అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. సెప్టెం బర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు ఆరు రాత్రులు, ఐదు పగళ్లతో ఈ యాత్ర సాగుతుంది.
ఆసక్తిగల వారు వివరాలను ఐఆర్సీటీసీ వద్ద నమోదు చేసుకోవచ్చు. ఈ టూర్లో మలేసియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాసాక్ అండ్ మ్యూజియం, ట్విన్ టవర్స్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలు.. సింగపూర్లోని నైట్ సఫారి, సిటీ టూర్, లయన్ సిటీ, సివిక్ డిస్ట్రిక్ట్, పడాంగ్, క్రికెట్ క్లబ్, పార్లమెంట్ హౌస్ తదితర ప్రాంతాలను చూడొచ్చు. టూర్ లో భాగంగా పర్యాటకులకు త్రీస్టార్ హోటల్లో వసతి కల్పిస్తారు. ఈ పర్యటనకు హైదరాబాద్ నుంచి వె ళ్లేవారు ఒకరికి రూ.72,040 (డబుల్ఆక్యుపెన్సీ) నుంచి రూ.87,350 (సిం గిల్ ఆక్యుపెన్సీ) వరకు చార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.57,410 చొప్పున చార్జీ ఉంటుంది. వైజాగ్ నుంచి రూ.72,760 నుంచి రూ.88,070 చార్జీ లుంటాయి. పిల్లలకు రూ.58,126 చార్జీ ఉంటుంది.
థాయ్లాండ్ పర్యటన..
వచ్చే ఆగస్టు 22 నుంచి 26 వరకు అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండు విడతలుగా సాగే థాయ్లాండ్ పర్యటన సదుపాయం హైదరాబాద్ నుంచి మాత్రమే ఉంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగే ఈ పర్యటనలో బ్యాంకాక్లో రెండు రాత్రులు, పట్టాయిలో రెండు రాత్రులు ఉంటారు. టైగర్ జూపార్కు, ఆల్కజార్ షో, కోరల్ ఐలాండ్, నాంగ్చూక్ ట్రాఫికల్ గార్డెన్, జెమ్స్ గ్యాలరీ, వాట్ఫో (బుద్ధ దేవాలయం), మార్బుల్ టెంపుల్ తదితర ప్రాంతాలను ఈ పర్యటనలో చూడొచ్చు. ఈ ప్యాకేజీకి ఒక్కోరికి రూ.43,460 (డబుల్ ఆక్యుపెన్సీ) నుంచి రూ.47,340 (సింగిల్ ఆక్యుపెన్సీ) వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. పిల్లలకు రూ.37,440 చొప్పున చార్జీ ఉంటుంది.
ప్రత్యేక రైలు యాత్రలు: ఐదు రాత్రులు, ఆరు పగళ్లపాటు కొనసాగే ప్రత్యేక రైలుయాత్రలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై యాత్రలుంటాయి. జూలై 29న కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది. ఆగస్టు 3న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ పర్యటన చార్జీలను రూ.13,600 (డబుల్ ఆక్యుపెన్సీ), రూ.15,940 (సింగిల్ ఆక్యుపెన్సీ), రూ.13, 160(ట్రిపుల్ ఆక్యుపెన్సీ)గా నిర్ణయించారు. పిల్లలకు రూ.10,880 తీసుకుంటారు. వివరాలకు 040-27702407, 040-27800580 నంబర్ ఫోన్లలో సంప్రదించవచ్చు.
రైల్వే ‘విదేశీ టూర్'
Published Wed, Jun 24 2015 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement