రూ.250 కోట్లతో {పతిపాదనలు సిద్ధం
సీఎం రాకే తరువాయి
ఊపందుకోనున్నరాజన్న గుడి అభివృద్ధి
వేములవాడ అర్బన్ : తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.250 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. సీఎం కేసీఆర్ను వేములవాడకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రమేశ్బాబు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం టూర్ ఖరారుకు ముందుగానే అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసి ఉంచుతోంది. నెల రోజులుగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.250 కోట్ల ప్రతిపాదనల తయారీ, పవర్ పాయింట్ ప్రజంటేషన్లపై దృష్టి సారించాయి.
ఇందులో భాగంగా వచ్చే 30 ఏళ్లకు సరిపడా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 500 వసతిగదుల నిర్మాణం, ఆదాయవ్యయాలను చూపించే పట్టిక సిద్ధం చేశారు. రూ.15 కోట్లతో కల్యాణ మంటపాల ఏర్పాటు, రూ.80 కోట్లతో గుడి చెరువునకు ఉత్తర భాగంలో 121 ఎకరాల భూమి కొనుగోలు, రూ.15 కోట్లతో దేవస్థానం రెండో ప్రాకారం, రూ.10 కోట్లతో ధర్మగుండం పునరుద్ధరణ చేపట్టనున్నారు.
రూ.60 కోట్లతో గుడి చెరువు ఈశాన్యభాగం పునరుద్ధరణ, ఉత్తర భాగంలో ఆధ్యాత్మిక ఉద్యానవనం, రూ.30 కోట్లతో శివపురం, శంకరపురం వద్ద 300 వసతి గదులు, రూ.10 కోట్లతో వేద-ఆగమ-సంగీత-నాట్య కళాశాల ఏర్పాటు, రూ.5 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయానికి క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజేశ్వరపురం వద్ద చౌల్ట్రీల నిర్మాణం, రూ.10 కోట్లతో నాంపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్లెట్ను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి ఈ బుక్లెట్ను అందజేసినట్లు తెలిసింది. వీటితోపాటు సీఎం కేసీఆర్ రాకతో మరిన్ని అభివృద్ధి పనులు సాధించుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో ఒక్కో అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్లెట్ను అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈ పనులన్నీ పూర్తయితే రాజన్న గుడి భూతల స్వర్గంగా భక్తులకు దర్శనమివ్వనుందని జనం చర్చించుకుంటున్నారు.
రాజన్నకు మహర్దశ
Published Mon, May 25 2015 5:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement