ఇక అన్ని ఇంజినీరింగ్ విభాగాలకు ఒకే ధర
అన్ని శాఖలూ కేంద్ర రవాణాశాఖ డేటాను అనుసరించాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు భారీఎత్తున పనులు చేపడుతున్న తరుణంలో రోడ్లు భవనాల శాఖ నిర్మాణ ధరలు పెరిగిపోనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్)ను భారీగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ధరలతోపోలిస్తే 18శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల నమోదవుతుందని అంచనా. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ మినహా మిగతా ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఏపీ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరిస్తున్నాయి.
ఇప్పుడు ఇంచుమించు అన్నీ సమం చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఆయా శాఖల పనుల్లో అనుసరిస్తున్న ఎస్ఎస్ఆర్ను రోడ్లు భవనాల శాఖ అనుసరించేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్అండ్బీ ఇప్పటికీ 2008-09 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్ఆర్నే వినియోగిస్తోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అన్ని ఇంజినీరింగ్ విభాగాలు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు గతంలో జారీ చేసిన 49వ నెంబర్ జీవోకు రిలాక్సేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖకు రూ.35లక్షల నుంచి రూ.40లక్షలు ఖర్చవుతుండగా ఇతర విభాగాలకు రూ.45 లక్షలకు పైగా ఖర్చవుతోంది. కొత్త ఎస్ఎస్ఆర్ వల్ల ఆర్అండ్బీ కూడా రూ.45 లక్షలకుపైగా ఖర్చు చేయవచ్చు. త్వరలో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన పనులు ఆర్అండ్బీ చేపడుతున్నందున ఖజానాపై భారం మోపినా... పనుల్లో వేగం పెంచుతుందంటున్నారు.
ఆర్అండ్బీకి కూడా ఎస్ఎస్ఆర్ వర్తింపు
Published Thu, Dec 25 2014 12:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement