సంగారెడ్డి క్రైం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బి.రవీందర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ అమలు కాకపోగా, ఆయన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలోనే అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోకపోగా వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కొత్త పింఛన్లు రాకపోగా ఉన్న పింఛన్లు ఊడిపోవడంతో అనేకమంది అర్హులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ‘ఆసరా’ అందక అనేకమంది వృద్ధులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. వేసవిలో విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలే టార్గెట్గా వైఎస్సార్ సీపీ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో యువకులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి పదవులు కట్టబెట్టి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు మొండి చెయ్యి
Published Sat, Feb 28 2015 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement