జిల్లాలో జోరుగా ‘మిషన్ కాకతీయ’
ముమ్మరంగా సాగుతున్న చెరువుల పనులు
పడావుగా రూ.30 లక్షలతో నిర్మించిన పైలాన్
ఆవిష్కరణపై అధికారుల్లో అనుమానం!
వరంగల్ : మిషన్ కాకతీయ పేరిట నిర్వహిస్తున్న చెరువుల పునరుద్ధరణ స్ఫూర్తిని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని చిన్న నీటివనరుల శాఖ జిల్లా కార్యాలయంలో పైలాన్ నిర్మించింది. ప్రస్తుతం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నారుు. మిషన్ కాకతీయ స్ఫూర్తిని తెలిపేందుకు అన్ని హంగులతో నిర్మించిన పైలాన్ మాత్రం పడావుగా మారింది. పైలాన్ ఆవిష్కరణతోనే మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. కాకతీయుల పరిపాలన కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలోని పైలాన్ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి 6న చేపట్టింది. రూ.30 లక్షలతో పైలాన్ను అద్భుతంగా నిర్మించారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో జనవరి 29 ఈ పైలాన్ను ఆవిష్కరించి పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర మంత్రి పర్యటనలో జాప్యం కావడం, వెంటనే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళి అమల్లోకి రావడంతో పైలాన్ ఆవిష్కరణ జరగలేదు. చెరువుల పునరుద్ధరణ పనులు ఎండాకాలంలోనే చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వేచి చూస్తే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాలో అధికారులే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు ఇదే బిజీలో ఉన్నారు. పైలాన్ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లాకు వచ్చినా పైలాన్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా పైలాన్ను ఆవిష్కరణకు నోచుకుంటుందా లేదా అనేది అనుమానంగా మారింది.
ముమ్మరంగా ‘చెరువు’ పనులు
జిల్లాలో 5,839 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులతో 3,55,037 ఎకరాల సాగు భూమికి నీటిని అందించే అవకాశం ఉంది. మొదటి దశలో జిల్లాలోని 1,173 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 845 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.330.64 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వాటిలో 562 చెరువుల పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది. 289 చెరువల పనులు మొదలయ్యాయి. ఇన్నాళ్లు శాసనమండలి ఎన్నిక కారణంగా పనుల ప్రారంభం నెమ్మదిగా సాగింది.
‘మిషన్’ పైలాన్ సంగతేంది!
Published Sun, Apr 5 2015 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement