♦ నిలిచిన మధ్యాహ్న భోజనం
♦ ఏజెన్సీ, గ్రామ సంఘం సభ్యుల మధ్య తెగని సమస్య
♦ ఇరువురూ కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్న అధికారులు
దోమ : మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మార్పు విషయంలో గ్రామ సంఘం సభ్యులు, వంట ఏజెన్సీ సిబ్బందికి మధ్య తలెత్తిన గొడవ కారణంగా మండల పరిధిలోని మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో రోజూ గు రువారం మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాలిలా.. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీని గ్రామ సంఘం తీర్మానం మేరకు ఏడాదికోసారి మార్చి కొత్తవారిని నియమించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇదే పద్ధతిలో గతే డాది ఆరంభంలో నియమించిన వంట ఏజెన్సీ సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించడానికి గ్రామ సంఘం ఇటీవల తీర్మానం చేసింది. అయితే గత ఏడాది వంట చేసిన సిబ్బంది గ్రామ సంఘం తీర్మానాన్ని దిక్కరించారు. ఈ సారి కూడా తామే వంట చేస్తామని, ఏజెన్సీని వదులుకునే ది లేదని చెప్పడంతో గొడవ మొదలైంది. గ్రామ సంఘం నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిశాక కూడా ఒకే ఏజెన్సీ సిబ్బంది వంట చేయడానికి వీలు లేదంటూ మహిళా సంఘాల సభ్యులు బుధవారం ఆందోళన నిర్వహించి వంట వండకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.
అయితే గురువారం ఉదయం వరకు కూడా అధికారులెవరూ జోక్యం చేసుకోకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో గ్రామ సంఘం సభ్యులు మరోసారి పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని మధ్యాహ్న భోజనం వండకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో చాలా మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం తెలియడంతో జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చంద్ర, ఇన్చార్జ్ ఎంపీడీఓ విజయప్ప, తహసీల్దార్ జనార్దన్ తదితర అధికారులు పాఠశాలకు చేరుకుని ఇరు వర్గాల వారితో చర్చలు జరిపారు. విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇరువర్గాలూ ఓ అంగీకారానికి వచ్చి సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని అధికారులు వారికి సూచించారు.
రెండో రోజూ విద్యార్థుల పస్తులు
Published Thu, Jul 30 2015 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement