రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Published Thu, Mar 23 2017 7:36 PM

Student killed in road accident

తిరుమలగిరి(సూర్యాపేట జిల్లా):  మండలకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతిచెందాడు.  నకిరేకల్‌ మండలానికి చెందిన అనిల్‌ కుమార్‌(17) ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి గురువారం బైక్‌పై తిరుమలగిరి వెళ్లాడు.
 
బైక్‌పై వెళ్తుండగా  మండలకేంద్రంలో వెనక నుంచి ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో  అనిల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement