రీయింబర్స్మెంట్పై విద్యార్థుల ఆనందం
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సోమవారం చేసిన ప్రకటనపై విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటు కళాశాలల యజమాన్యాలు కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో కొంతకాలంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. విద్యాసంవత్సరం ముగుస్తున్న విద్యార్థులను కళాశాల యజమాన్యాలు ఫీజుల పేరిట వేధిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో లేదోనని కంగారుపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామంటూ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసకున్నారు. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఫ్రెష్ విద్యార్థులు 7,634 మంది, రెన్యువల్ విద్యార్థులు 6,693 మంది ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 5 కోట్ల 24 లక్షలు, ఉపకార వేతనాల కోసం రూ. 6 కోట్ల 77 లక్షలు ఇప్పటి వరకు మంజూరయ్యాయి. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్లో రూ. 47 లక్షలు, ఉపకార వేతనాలకు రూ. కోటి 29 లక్షలు విడుదల కాశాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ విషయానికి వస్తే రెన్యువల్ విద్యార్థులు 27,347, ఫ్రెష్ విద్యార్థులు 23,787 మంది ఉన్నారు. ఇందులో ఉపకార వేతనాల కోసం రూ. 32 కోట్ల 3 లక్షలు, రీయింబర్స్మెంట్ కోసం రూ. 18 కోట్ల 7 లక్షలు మంజురయ్యాయి.
అయితే 23,787 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నేటికి ఒక్క రూపాయి కూడా రాలేదు. రీయింబర్స్మెంట్కు సంబంధించి రూ. 5 కోట్ల 50 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 15 కోట్ల 24 లక్షల నిధులు ఇంకా మంజూరు కావాల్సి ఉంది. ఈబీసీ విద్యార్థులు 3,457 మందికిగాను ఉపకార వేతనాలు రూ. 3 కోట్ల 25 లక్షలు రావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన రెన్యువల్ విద్యార్థులు 3,619 మంది ఉండగా, ఫ్రెష్ విద్యార్థులు 3,949 మంది ఉన్నారు. రీయింబర్స్మెంట్ను సంబంధించి రూ. కోటి 72 లక్షలు, ఉపకార వేతనాలు సంబంధించి రూ. 2 కోట్ల 59 లక్షల మంజూరయ్యాయి.
ఇంకా ఉపకార వేతనాల కోసం రూ. 3 కోట్లు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరానికి 3,949 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రీయింబర్స్మెంట్ కోసం మొత్తం రూ. 6 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 22 కోట్ల 79 లక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటనతో నిధులు విడుదలైతే విద్యార్థులకు, కళాశాలల యజమాన్యాలకు ఇబ్బందులు తప్పినట్లే.
సీఎం ప్రకటనపై సర్వత్రా హర్షం
Published Tue, Jun 17 2014 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement