- ఎండుతున్న మొక్కలు
- కానరాని నీడ పందిళ్లు
- సగం కూడా దక్కడం అనుమానమే!
- వచ్చే నెల నుంచే హరితహారం
- ప్రశ్నార్థకంగా పథకం అమలు
మెదక్ జోన్: మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం హరితహారం పథకం అమలుకు అడ్డంకిగా మారాయి. మరో నెలరోజుల్లో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉంది. కానీ అధికారుల ప్రాణాళికకు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు చాలావ్యత్యాసం కనిపిస్తోంది. లక్ష్యం మేరకు మొక్కలు కానరావడంలేదు.
ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రాణాళికను సిద్ధం చేశారు. అందుకు అణుగుణంగా 122 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం సైతం సరైన వర్షాలు లేకపోవటంతో నర్సరీల్లో పెంచిన మొక్కలు 75 శాతం మేర అలాగే ఉన్నాయి. అందులో 50 శాతం పైగా మొక్కలు ఎండలకు ఎండిపోయాయి. గతయేడాది పెంచిన మొక్కలతో పాటు ఈయేడు మరికొన్ని మొక్కలను పెంచి మొత్తం 1.48 కోట్ల మొక్కలను నాటాలని ఫారెస్టు అధికారులు నిర్ణయించారు. కాని ఎండలు మండుతుండటంతో ఇప్పటికే 37 లక్షలకు పైగా మొక్కలు ఎండినట్టు సమాచారం.
మొత్తానికి లక్ష్యం దిశగా అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకోసం మొక్కలను ఏఏ ప్రాంతాల్లో నాటాలి? ఏ ఏమొక్కలు నాటాలి? రైతులు ఏ రకమైన మొక్కలను కోరుకుంటున్నారు? రోడ్లకు ఇరువైపుల ఎన్ని లక్షల మొక్కలు నాటాలి? అనేదానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. అంతే కాకుండా అడవుల్లోని గ్యాప్ప్లాంటేషన్ 425 ఎకరాల్లో నాటేం దుకు సైతం అధికారులు ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈయేడు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. అందుకు తోడు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం తోడైంది. దీంతో హరితహారం పథకం ఈయేడు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం కష్టమని పలువురు భావిస్తున్నారు.
ఎండల నుంచి నర్సరీల్లోని మొక్కలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నీడకోసం షెడ్ నెట్స్ను పంపిణీ చేస్తే అధికారులు వాటిని చాలాచోట్లా మూలాన పడేశారు. కొన్ని గ్రామాల్లో నర్సరీ నిర్వాహకులు ఆ నెట్లను మొక్కలకు కట్టకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్షం వల్లా షెడ్ నెట్లను ఏర్పాటు చేయక పోవటంతో నర్సరీల్లోని సగానికి పైగా మొక్కలు ఎండిపోతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు ఉన్నాయి.
బైక్లు సైతం ఇచ్చినా..
ఫారెస్టు అధికారులు ఎప్పుడు అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి బైక్లను సైతం ఇచ్చింది. కానీ ఆ బైక్లతో సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తూ అడవుల సంరక్షణను మరిచి పోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో మొక్కలను రక్షించేందుకు తగుచర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరితహరం పథకంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం వచ్చేవర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటడం కష్టమనే చెప్పాలి.
నర్సరీలకు ఎండదెబ్బ
Published Mon, May 1 2017 11:39 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement