సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ | Sakshi
Sakshi News home page

సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ

Published Fri, Aug 8 2014 7:45 PM

సురేశ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు: అనురాగ్ శర్మ - Sakshi

హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిలిజెన్స్ డీఎస్పీ సురేష్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని డీజీపీ అనురాగ్‌ శర్మ మీడియాకు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో సురేశ్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత మీడియాతో అనురాగ్ శర్మ మాట్లాడారు. 15 రోజుల క్రితమే యశోదలో చికిత్స తీసుకున్నారని, ఈరోజే సురేష్‌రావు డ్యూటీకి వచ్చాడు అని అనురాగ్‌శర్మ తెలిపారు. 
 
కేసీఆర్ కు గతంలో భద్రతాధికారిగా పనిచేసిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం సురేశ్ రావు ఇంటలిజెన్స్ డీఎస్పీగా సేవలందిస్తున్నారు. ఆయన మృతికి కేసీఆర్, ఇతర పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement