హైదరాబాద్ : నల్లగొండ ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు సిమీ కార్యకర్తలని నిన్ననే తెలిసిందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మరో ముగ్గురు సిమీ కార్యకర్తలను అయిదు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారన్నారు. వారి కోసం నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు సోదాలు చేపడుతున్నారని నాయిని తెలిపారు.
జరిగిన సంఘటనల్లో హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఎవరూ లేరని, నగరానికి చెందిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఏది జరిగినా హైదరాబాద్కు ఆపాదించటం సరికాదని, అనవసరంగా హైదరాబాద్ పేరును దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని నాయిని తెలిపారు. మరోవైపు తీవ్రవాద సంఘటనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వీఐపీలకు ఇచ్చే భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. నేతల కాన్వాయ్లకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయనున్నారు.
మరణించింది ఎవరో నిన్న తెలిసింది...
Published Mon, Apr 6 2015 2:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement