రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Feb 9 2015 12:26 PM

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా  నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే... జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  రాజయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య.. అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు. మరోవైపు ఆయన  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు.

Advertisement
Advertisement