మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యపై శ్రద్ధ వహించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి నూతనంగా 20 బెడ్లు మంజూరయ్యాయి. ఏఆర్ సిబ్బంది విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ బెడ్లను కేటాయించారు.
గతంలో కూడా 20 బెడ్లు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా ఎస్పీ కోటిరెడ్డి బెడ్లను పరిశీలించి మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి విశ్రాంతి కూడా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, ఏఆర్ డీఎస్పీలు రామచందర్రావు, జనార్దన్రెడ్డి, ఆర్ఐ నర్సయ్య, డీసీఆర్బీసీఐ తిరుపతి పాల్గొన్నారు.