రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే.. తాను ఇక్కడ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ‘టీఆర్ఎస్లో చేరినప్పుడు మార్కెట్లో పశువులను కొనుగోలు చేసినట్లు కొన్నాడని కేసీఆర్ను దూషించి.. ఇప్పుడు మీరు చేసిందేమిటి? అని ప్రశ్నించారు.
సత్యహరిశ్చంద్ర అని చెప్పుకొనే మీరు ఇలాంటి పనులు చేయడమేంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి సోషల్మీడియాలో, వాట్సాప్లో వీడియోలను చూసి ప్రజలు నవ్వుకుంటు న్నారని పేర్కొన్నారు. ‘టీడీపీ నుంచి టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు చేరినప్పుడు రాజకీయ వ్యభిచారమని, మార్కెట్లో పశువులంటూ అనరాని మాటాలన్నావు. మరి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చావు.. దీన్నేమం టారు’అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.