సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ముదిగొండ: మార్చి 19వ తేదీలోపు పోడు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోతే మరో పాదయా త్ర చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లా ముది గొండలో సోమవారం సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం హామీ మాటలకే పరిమితమైందన్నారు.
దళితులకు మూడెకరాల భూమి, పేదోళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు. నిరుద్యోగులు అడ్డా కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై సీఎం కేసీఆర్కు ఇప్పటివరకు 99 లేఖలు రాశానని, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదన్నారు.