ప్రభుత్వానికి ప్రతిపక్షాలు
ఉండకూడదన్న దురుద్దేశం
ప్రభుత్వ తీరుపై
ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
జిల్లా ప్రాజెక్టులను సందర్శించిన మాజీ ఎమ్మెల్యేల బృందం
ఆత్మకూర్/కొత్తకోట రూరల్/మాగనూర్: రా ష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దుష్టపాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నాయకులను తమ టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి వారంతా పార్టీకి తిరిగిరావడం ఖాయమని, వారి మధ్య కుమ్ములాటలు ఏర్పడక తప్పవని హెచ్చరించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, కె.దయాకర్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, బక్క ని నర్సింహులు జిల్లాలోని రా మన్పాడు ప్రాజెక్టుతో పాటు దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తికేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. రాష్ట్రంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్ర ప్ర భుత్వం రూ.790కోట్ల కరువునష్టం ప్రకటిం చినా నేటికీ సహాయక చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు రూ.75 కోట్లు కావాలని నివేదికలు పంపిస్తే కేవలం రూ.15కోట్లు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 39టీఎంసీలు వాడుకునేందుకు వాటా ఉం దని అన్ని ప్రాజెక్టులకు కలిపి 140టీఎంసీ లు కేటాయించాలని కోరారు.
దిగువ జూరాలలో చేతి కొచ్చిన పవర్ ప్లాంట్ను నీటముంచారని, అం దుకు సంబంధించిన కారణాలు, బాధ్యులను నేటికీ తేల్చలేదని ఎంతో విలువైన విద్యుత్ను, రూ.వందల కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిం దన్నారు. దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ జెన్కో పవర్హౌజ్ నీట మునిగిన నేపథ్యంలో తమ బృందం గతంలోనే పర్యటించి.. ఈ సంఘటన మానవ తప్పిదం వల్లనే జరిగిందని, వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ వేశారని, కానీ ఆ కమిటీ నివేదిక నేటికీ బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నీటిగండం
రామన్పాడు ప్రాజెక్ట్ డెడ్స్టోరేజీకి చేరిందని, వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రామన్పాడు ప్రాజెక్టు ఇంత దయనీయస్థితికి చేరిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై చూపాలని ప్రభుత్వానికి హితవుపలికారు. అంతకుముందు రామన్పాడ్ ప్రాజెక్టులో మిగిలి ఉన్న నీటిలో వారంతా పడవలో ప్రయాణించి పరసరప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేస్త్రీ శ్రీనువాసులు, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు నాగ న్నయాదవ్, కొమ్ము భరత్భూషణ్ ఉన్నారు.
రైతుల ప్రయోజనాలు కాపాడాలి: రావుల
మాగనూర్: రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకపోవడం దారుణమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను కాపాడకపోతే మీకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.దయాకర్రెడ్డి, కె.సీతమ్మ, బక్కని నర్సిములు, ఎంపీపీ అంజనమ్మ ఆధ్వర్యంలో కృష్ణానదిలో నీళ్ల పరిస్థితిని పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని కూడా వదలకుండా కర్ణాటక రైతులు నీటిచౌర్యానికి పాల్పడితే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కృష్ణానదిలో సగం నీటివాటా సాధించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఎల్లాగౌడ్, రవిందర్, లక్ష్మినారాయణ, కృష్ణమూర్తి, శేఖర్గౌడ్ ఉన్నారు.
రాష్ట్రంలో సీఎం దుష్టపాలన
Published Thu, Feb 25 2016 4:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement