చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం | Sakshi
Sakshi News home page

చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం

Published Mon, Dec 21 2015 12:48 PM

చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం - Sakshi

మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు సోమవారం ఎర్రవెల్లిలోని అయుత చండీయాగం క్షేత్రంలో గణపతి పూజలు నిర్వహించారు. ఈనెల 23వ తేదీ నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పూజలు చేసినట్లు సమాచారం. అలాగే శృంగేరి పీఠం రుత్వికుల ఆధ్వర్యంలో గురు పూజ కూడా నిర్వహించారు. అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా పూజలు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement