Sakshi News home page

బాపూఘాట్ వద్ద మహాత్ముడికి కేసీఆర్ నివాళి

Published Thu, Oct 2 2014 11:13 AM

బాపూఘాట్ వద్ద మహాత్ముడికి కేసీఆర్ నివాళి - Sakshi

హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద కేసీఆర్.... గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.  ఈసందర్భంగా కేసీఆర్ బాపూఘాట్ భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

Advertisement
Advertisement