రాంనగర్ : నవంబర్ 1వ తేదీ నుంచి ఆహారభద్రత కార్డులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ, వీఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని నిర్ణయించినందున ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఒక రిజిష్టరులో నమోదు చేసి 16వ తేదీలోగా తహసీల్దార్లకు అందజేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ల కోసం నేటి(గురువారం) నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించాలన్నారు. 16నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వేతో సరి చూసుకుని ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు.
అర్హులైన వారికి నవంబరు 1వ తేదీ నుండి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని సూచించారు. అదే విధంగా పింఛన్ దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా లేఖలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు డివిజన్స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ను నియమిస్తామని చెప్పారు. ఫాస్ట్ పథకం కింద లబ్ధిపొందేందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో గురువారం నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తహసీల్దార్లు అట్టి దరఖాస్తులను పరిశీలించి ఈ నెలాఖరులోగా సర్టిఫికెట్లను జారీ చేయాలని కోరారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పని చేసి సామాజిక, ఆర్థిక, కుల గణనను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం కులగణన తుది నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ ప్రీతి మీనా, ఏజేసీ వెంకట్రావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, సీపీఓ నాగేశ్వరరావు, ఎల్డీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 1నుంచి ఆహారభద్రత కార్డుల జారీ
Published Thu, Oct 9 2014 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement