Sakshi News home page

జహంగీర్‌ పీర్‌ దర్గాలో కేసీఆర్‌ ప్రార్థనలు

Published Fri, Nov 10 2017 3:09 PM

Telangana CM kcr visits Jahangir Pir Dargah  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ సమీపంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వచ్చి దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. కేసీఆర్‌ వెంట డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ ఉన్నారు.

Advertisement
Advertisement