జైరాం వ్యాఖ్యలపై టీ కాంగ్ నేతల అసంతృప్తి
సీఎం రేసులో ఉన్న బీసీ, అగ్రవర్ణాల నేతల అసహనం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోనే చిచ్చు రేపాయి. సీఎం పదవిపై గంపెడాశలు పెట్టుకున్నముఖ్య నేతలంతా జైరాం వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ, అగ్రవర్ణాల నేతలు జైరాంపై అసహనంతో ఉన్నారు. అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్కు కీలకమని, ఈ సమయంలో జైరాం ఓ వర్గానికే పెద్దపీట వేస్తామని చెప్పడం తొందరపాటు చర్యేనని అంటున్నారు. దీనివల్ల పార్టీ నేతల్లో చీలిక వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ఎస్.జై పాల్రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్కుమార్రెడ్డి వంటి నేతలు సీఎం రేసులో ఉన్నారు. జైపాల్రెడ్డి మినహా మిగతా వారంతా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్న వారే. సహజంగా పీసీసీ అధ్యక్షుడే ఎన్నికల తరువాత సీఎం రేసులో ముందుంటారు. ఈ తరుణంలో జైరాం దళిత సీఎం నినాదాన్ని ముందుకు తేవడంతో వారు ఖిన్నులయ్యారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం సీటు కోసం వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తాత్కాలికంగా వర్గ విభేదాలను పక్కనపెట్టి అంతా కలసికట్టుగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘తెలంగాణ సాధనలో మేమే ముందున్నాం. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. రాళ్ల దాడులకు గురయ్యాం. ఒక దశలో నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. అయినా వెనుకడుగు వేయకుండా నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలందరిలో మనోస్థైర్యం నింపేందుకు ప్రయత్నించాం.
నిత్యం సభలు, సమావేశాలు పెట్టాం. ఇన్ని కష్టాలు, నష్టాలు అనుభవించిన మమ్మల్ని కాదనడం, ఎన్నికల తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదు’’ అని దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీకి దూరమైన ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకే ‘దళితుడే సీఎం’ అనే నినాదాన్ని జైరాం ముందుకు తెచ్చారన్న వాదన కూడా ఉంది. అయితే ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లోని ఎస్సీ నేతల్లోనూ చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని పీసీసీ ఎస్సీ విభాగం నేతలంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాబోయే సీఎం అని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తుండగా, సీఎం రేసులో తానూ ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రకటించారు. మాజీమంత్రి గీతారెడ్డి, మరికొందరు నేతలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పడు ఇలాంటి నేతల మధ్య పోటీ తీవ్రమై, మరిన్ని చిక్కులు వస్తాయని ఆ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్లో ‘దళిత సీఎం’ చిచ్చు
Published Tue, Mar 11 2014 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement