గజ్వేల్ రూరల్/జోగిపేట/మెదక్ టౌన్, న్యూస్లైన్: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్, జోగిపేట, మెదక్ పట్టణాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రజలకు ప్రధానమైన పలు హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చేందుకు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తేలేదు..
తెలంగాణ తెచ్చింది తామేనని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని రాజయ్య యాదవ్ అన్నారు. 60 ఏళ్ల పోరాటం, 1,200 మంది విద్యార్థులు, యువకుల బలిదానాలు చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ నేతలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అని చెప్పుకోవడం సరికాదన్నారు. వెనుక బడిన తెలంగాణ ప్రాంతాన్ని వదిలి సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని రాజయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ కీలకపాత్ర కీలకమని, పునర్నిర్మాణంలోనూ టీఆర్ఎస్ ప్రధాన భూమిక పోషించాల్సి ఉన్నందున ఒంటరి పోరుకు మొగ్గు చూపుతున్నామన్నారు.
చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతావా?
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన చంద్రబాబు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. తెలంగాణలో దుకాణాన్ని మూసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రాంతానికి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాననడం హాస్యాస్పదమని రాజయ్య యాదవ్ అన్నారు. చంద్రబాబు పరిపూర్ణత గల రాజకీయ నాయకుడైతే తెలంగాణకు సీఎం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చే చివరి క్షణం వరకు కూడా అడ్డుకునేందుకు అన్ని జాతీయ పార్టీల నేతల కాళ్లు పట్టుకొని బతిమాలిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, రాష్ర్ట కార్యదర్శి ఎం.దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య, అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ అభివద్ధి కేసీఆర్తోనే సాధ్యం
Published Fri, Mar 14 2014 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement