సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్ హామీ ఇచ్చారు. ప్రపంచ ఆహార సదస్సు–2018లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎమ్మె ల్యే సీహెచ్ రమేశ్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు జర్మనీ వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం జర్మనీ విత్తన ప్రముఖులతో అక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్లోవిక్నర్ తెలంగాణ రాష్ట్రం విత్తన ధ్రువీకరణ కింద పలు దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయడాన్ని అభినందించారు. తెలంగాణను గ్లోబల్ సీడ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో గ్లోబల్ సీడ్ అడ్వయిజరీ బాడీ, ఇండో–జర్మన్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్కు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్మనీ–తెలంగాణ మధ్య ఉన్న ఇండో–జర్మన్ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం..
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పంపిన లేఖను క్లోవిక్నర్కు ఎమ్మెల్యే రమేశ్, డాక్టర్ కేశవులు అందజేశారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్ ఆ లేఖలో ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ఆసియాలోనే మొదటిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, విత్తన శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ప్రపంచ ఆహార సదస్సుకు కొన్ని కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం దిశగా తెలంగాణ పయనిస్తున్న సమయంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్, విత్తన ఎగుమతికి సహకరిస్తున్న ఇండో–జర్మన్ ప్రాజెక్టు నిర్వహకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
గ్లోబల్ సీడ్ వ్యాలీగా తెలంగాణ
Published Wed, Jun 27 2018 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement