* అవసరమైనప్పుడు విద్యుదుత్పత్తి చేపడుతున్న తెలంగాణ సర్కారు
* ఎక్కువనీటిని వాడుతున్నారని కృష్ణాబోర్డుకు వివరాలిస్తున్న ఏపీ
* ఈ నెల 1 నుంచి బుధవారం వరకు 4.56 టీఎంసీల నీటి వినియోగం..
* 21.23 మి.యూ. విద్యుదుత్పత్తి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పేచీ కొనసాగుతోంది. ఐదు రోజుల పాటు విరామం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు రోజు లుగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు.. కృష్ణా బోర్డు సూచించిన నీటి కంటే తెలంగాణ ఎక్కువగా వాడుకుంటోందంటూ ఏపీ ప్రభుత్వం ఏరోజుకారోజు బోర్డుకు సమాచారం అందిస్తోంది. తాము అవసరం మేరకే శ్రీశైలంలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ జెన్కో చెబుతోంది. నవంబర్ ఒకటి నుంచి బుధవారం వరకు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున 21.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీనికి ఇప్పటివరకు 4.56 టీఎంసీల నీటిని వాడుకున్నామని... ఆందోళనకర స్థాయికి జలాశయంలో నీటి మట్టమేమీ పడిపోలేదని టీ జెన్కో వర్గాలు స్పష్టం చేశాయి.
ఇక శ్రీశైలంలో మంగళవారం 4.18, బుధవారం ఉదయం వరకు 1.06 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. గురువారం కూడా ప్రాజెక్టులో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగింది. ప్రస్తుతం శ్రీశైలంలో 857 అడుగుల నీటిమట్టం ఉంది. నవంబర్ 2వరకూ మూడు టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవాలని గత నెల 31న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. 15 రోజుల తర్వాత మరోసారి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామని పేర్కొంది. ఆ గడువు కూడా సమీపించిన నేపథ్యంలో... బోర్డు తదుపరి సమావేశం నిర్వహిస్తుందా..? లేదా? అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
శ్రీశైలంపై కొనసాగుతున్న పేచీ!
Published Thu, Nov 13 2014 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement