ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ

16 Sep, 2019 13:03 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ సోమవారం ఢిల్లీలో ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ ఈ నెల 8న  బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా గవర్నర్‌ కలిసే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు