ఆరవై ఏళ్ల తండ్లాటను తెరదించుతూ.. గత సంవత్సరం ఇదే రోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం మొదటి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. డప్పుల చప్పుళ్లతో.. ధూంధాం ఆట పాటలతో.. రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొంది.
- ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
- హైదరాబాద్: కేంద్రమంత్రి దత్తాత్రేయతోపాటు డీజీపీ అనురాగ్ శర్మ , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
- రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
- రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగుర వేశారు.
- మెదక్: మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో అమరవీరుల స్థూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
- నిజామాబాద్: అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం, అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్ తెలిపారు.
- ఆదిలాబాద్: తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసిన మంత్రి జోగురామన్న అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
- మహబూబ్ నగర్: అమరవీరుల స్తూపానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాసగౌడ్, కలెక్టర్ శ్రీదేవి నివాళులు అర్పించారు.
- కరీంనగర్: జిల్లాలో అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
-
ఖమ్మం: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.