సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్, కౌంటింగ్కు అవకాశముంది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
Related news by tags
-
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్లో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్తో పోర్టబుల్ డివైస్గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
2019 ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది?
ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఈరోజుతో ముగియనున్నాయి. ఆ తర్వాత అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.పలు ఏజెన్సీలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకూ నిజమయ్యాయో ఇప్పుడు చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని స్పష్టంగా వెల్లడయ్యింది. ఫలితాల్లో కూడా అదే జరిగింది. 2019లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీనే రికార్డు స్థాయిలో 303 సీట్లు దక్కించుకుంది.2019 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ 90 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు గాను ఎన్డీఏ 49 సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్లో వెలువడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 సీట్లు గెలుచుకుంది. రాయ్బరేలీ సీటు ఎస్పీకి దక్కింది. 10 సీట్లు బీఎస్పీ, కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.ఎగ్జిట్ పోల్స్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీలకు 29 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 71 బీజేపీకి, రెండు అప్నాదళ్కు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్ఏడీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బిహార్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
నేటి ఫైనల్ రౌండ్ ఛాంపియన్ ఎవరు? 2019లో ఏం జరిగింది?
2024 లోక్సభ ఎన్నికల ప్రయాణం నేటితో ముగింపు దశకు చేరుకోనుంది. నేడు (శనివారం,జూన్ 1) జరిగే ఏడో దశ పోలింగ్లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు స్థానం వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, భోజ్పురి నటుడు రవి కిషన్, భోజ్పురి సింగర్ పవన్ సింగ్, కాజల్ నిషాద్ తదితరులు నేడు జరిగే పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.2019లో ఈ 57 సీట్లలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకుంది. టీఎంసీకి 9, బీజేడీకి 4, జేడీయూ, అప్నాదళ్ (ఎస్)కు చెరో రెండు సీట్లు చొప్పున వచ్చాయి. జేఎంఎం కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పంజాబ్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది.2024 లోక్సభ ఎన్నికల ఏడవ దశలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 56 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ 51 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. టీఎంసీ తొమ్మది మంది అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అకాలీదళ్ 13 మంది అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపింది. పంజాబ్లోని మొత్తం 13 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. బిజూ జనతాదళ్ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.2019 ఎన్నికల్లో మొదటి దశలో 70 శాతం ఓటింగ్ జరిగింది. 2024 మొదటి దశలో ఓటింగ్ శాతం 66.1గా ఉంది. 2019 రెండవ దశలో 70.1శాతం ఓటింగ్ నమోదైంది. 2024 రెండవ దశలో 66.7 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 మూడవ దశలో ఓటింగ్ శాతం 66.9శాతం. 2024 మూడో దశలో 65.7 శాతం ఓటింగ్ జరిగింది. 2019 నాలుగో దశలో 69.1 శాతం ఓటింగ్ జరగగా, 2024 నాలుగో దశలో 69.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఐదో దశలో 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 ఐదవ దశలో 62.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఆరవ దశలో 64.2 శాతం ఓటింగ్ జరిగింది. 2024 ఆరవ దశ ఎన్నికలలో 63.4 శాతం ఓటింగ్ జరిగింది. -
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్మహల్ లోక్సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
Sharmila పొలిటికల్ ఫ్యూచర్?
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్కు పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాక తప్పదు. పోల్మేనేజ్మెంట్లో ఎవరికి తీసిపోదు. త్రిముఖ పోటీలో గెలుపు అంచుల వరకు వస్తుంది.’’ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. ఇప్పుడామెకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని సెఫాలజిట్లు చెబుతున్నారు. కడప పార్లమెంట్తోపాటు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్ల ల్లో కూడా డిపాజిట్టు గగనమే. దీంతో షర్మిల చరి్మషా ప్రశ్నార్థకం కానుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, ఓ సందర్భంలో ‘ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నాజీవితం ఇక్కడే ముడిపడి ఉంది, చావైనా, బతుకైనా ఇక్కడేనని’ చెప్పుకొచ్చింది. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. స్పీడ్గా అన్ని జిల్లాలను చుట్టేసిన ఆమె తుదకు కడప పార్లమెంట్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా వర్తింప జేసింది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ ఆడబిడ్డను ఆదరించండి, మీకోసం తుది వరకు అండగా నిలుస్తానంటూ కోరారు. అంతవరకు బాగానే ఉన్నా, ఆపై అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా చూపి ఓట్లు అభ్యర్థించడం ఆరంభించింది. ఎప్పుడు తిరగని, చూడని గ్రామాలకెళ్లినా పట్టణాలకెళ్లినా పనిగట్టుకొని అమె విమర్శలు గుప్పించింది. మరోవైపు పులివెందుల ప్రాంతలో సెంటిమెంట్ అ్రస్తాన్ని సైతం ప్రయోగించి, కొంగు చాచి ఓట్లు అడిగింది. ఇంతచేసినా సెఫాలజిట్లు షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాల్లో అదే రుజువవుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. తులసిరెడ్డికి చేదు అనుభవంకడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తొలివిడత ప్రచారంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెన్నంటే ఉన్నారు. జిల్లా వాసులకు పరిచయం చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండోవిడత ప్రచారంలో తులసిరెడ్డి ఎక్కడా లేరు. వాగ్దాటి పటిమ ఉన్న తులసిరెడ్డిని కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈమారు షర్మిల పర్యటన కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేపట్టినట్లు సమాచారం. క్రియాశీలక మైనార్టీ నాయకుడు సత్తార్ పరిస్థితి కూడా అంతే. వీరంతా షర్మిల కంటే ముందు కాంగ్రెస్ గళాన్ని జిల్లాలో విన్పించిన నాయకులు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలితో పక్షం రోజుల వ్యవధిలో అంటీముట్టనట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎన్నికల సందర్భంలో పార్టీ ఇమేజ్ పెంచుకోకపోగా, ఉన్న వారిని కూడా చేజార్చుకున్న పరిస్థితి ఉతప్పన్నమైందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులు సైతం.... షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ముందుకు వచ్చారు. కారణం ఎన్నికల, పోలింగ్ బూత్ ఖర్చులు అమె భరిస్తుందని భావించారు. పోటీ చేసినా ఆయా అభ్యర్థులు కూడా చేదు అనుభవం చవిచూశారు. కడపలో పోలింగ్ బూత్ ఖర్చుల విషయమై ఏజెంట్లుగా నిలుచున్న పలువురు ఆ తర్వాత కూడా అభ్యర్థి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో గణనీయమైన ఓట్లు సాధించి డిపాజిట్టు దక్కించుకుంటేనే షర్మిలకు పారీ్టలో కనీస గౌరవం ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.కాంగ్రెస్వాదులకు దక్కని మర్యాద... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొర విని్పంచుకోగా, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలకి ఏపీలో గడ్డుపరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులకు మర్యాద దక్కలేదు. అందులో భాగంగా పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కేరాఫ్ అడ్రస్గా ఉన్న నజీర్ అహమ్మద్ షరి్మల బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఆ పారీ్టకి దూరమయ్యారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించి తర్వాత తెలంగాణకు చెందిన ఎస్కే బాషిద్ను ప్రకటించారు. మనస్థాపం చెందిన ఆయన కాంగ్రెస్ పారీ్టకి దూరమయ్యారు. హైదరాబాద్లో స్థిర పడిన బాషిద్ ఎంపిక వెనుక షరి్మల సన్నిహితుల సిఫార్సులేనని స్పష్టమవుతోంది. అలాగే కడప నగరానికి చెందిన జక్కరయ్య పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన సందర్భంలో సైతం ఆ పార్టీ జెండాను జక్కరయ్య వీడలేదు. కడప అభ్యరి్థత్వం రాత్రికి రాత్రే మార్పు చేశారు. జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడితో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు వైఎస్సార్సీపీ నేతగా ఉన్న అఫ్జల్ఖాన్ను తెరపైకి తెచ్చారు. -
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
జూన్ 3 తిరుమల.. భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 83,740 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.71 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
‘నైరుతి’ వచ్చేసింది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవేగంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవేశించాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాసరావు (51) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. -
‘స్మార్ట్’గా దోపిడీ
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.ఆన్లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్లు, అల్గారిథమ్ మానిప్యులేషన్లు, అక్రమ రుణ యాప్లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్లైన్ టాస్క్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతిమే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్లైన్లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.ఇక డిజిటల్ అరెస్ట్ల (వీడియో కాల్స్ స్కామ్లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్లోని మైవాడ్డీ, థాయ్లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ⇒ సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది. ⇒గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒ అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒ ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా.. 2019 26,049 2020 2,57,777 2021 4,52,414 2022 9,66,790 2023 15,56,218 2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే)
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
వడదెబ్బకు గత 72 గంటల్లో 99 మంది మృతి
రేపటి కౌంటింగ్ కు అధికారుల విస్తృత ఏర్పాట్లు
'మహాలక్ష్మి' కోసం మహిళల నిరీక్షణ..
లిక్కర్ కేసు: జులై 3దాకా కవితకు కస్టడీ
రోజురోజుకి అందం పెంచుతున్న కృతి శెట్టి (ఫొటోలు)
సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ట్రెండింగ్ క్వీన్గా గుర్తింపు (ఫోటోలు)
హనీమూన్ ఎక్స్ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- 'మహాలక్ష్మి' కోసం మహిళల నిరీక్షణ..
- సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
- పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అప్పుడు తాగి ఉన్నా..!’
- 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
- Medi Tips: గ్యాస్ సమస్యా? తగ్గించుకోండిలా!
- తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
- భేటీలతో మోదీ బిజీ బిజీ
- సెల్ఫీ తెచ్చిన విషాదం
- టైమ్స్ నౌ–ఈటీజీ ఎగ్జిట్ పోల్లో వైఎస్సార్సీపీ హవా
Advertisement