మార్చి 1 నుంచి ‘తెలంగాణ జనజాతర’ | Sakshi
Sakshi News home page

మార్చి 1 నుంచి ‘తెలంగాణ జనజాతర’

Published Sat, Feb 28 2015 4:26 AM

Telangana janajatara from march 1 to 4

సాక్షి, హైదరాబాద్; హైదరాబాద్‌లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జరపతలపెట్టిన సీపీఐ(ఎం) రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి ప్రతిబింబించే విధంగా తెలంగాణ జన జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన కళారూపాలను ప్రదర్శించటానికి ఆరు ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
 

Advertisement
Advertisement