ఆ రెండు చానళ్లపై నిషేధం ఎత్తివేయాలని ధర్నా | Sakshi
Sakshi News home page

ఆ రెండు చానళ్లపై నిషేధం ఎత్తివేయాలని ధర్నా

Published Sun, Sep 7 2014 2:02 AM

Telangana Journalists demand KCR to lift ban on TV 9 and ABN channels in Delhi Politics

ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసం ఎదుట పాత్రికేయుల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్లపై నిషేధాన్ని ఎత్తేసి ప్రసారాల్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీ తుగ్లక్‌రోడ్‌లో సీఎం కేసీఆర్ నివాసం ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. ఈ రెండు చానళ్లపై నిషేధాన్ని ఎత్తేయాలని, మీడియా స్వేచ్ఛకు భంగం కల్పించవద్దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కృష్ణ, శ్రవణ్‌కుమార్, జయప్రకాశ్, గోపరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement