రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు..

Published Wed, Apr 19 2017 7:03 PM

Temperatures  Rising in the state

హైదరాబాద్‌: రాను రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు పది గంటల  తరువాత బయటకు రావాలంటే ఆలోచిస్తున్నారు. ఇంకా మే నెల రాకముందే ఎండలు పెరిగిపోయాయి.  భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్‌ పిల్లలు స్కూల్‌కి వెళ్లి రావడానికి చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో నమోదయిన ఉష్ణోగ్రతల వివరాలు కింద ఇవ్వడమైనది.
 
పట్టణం పేరు    గరిష్ట ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌  --      44.1
భద్రాచలం   --       40.8
హకీంపేట    --      40.3
హన్మకొండ  --       41.0
హైదరాబాద్‌ --       42.0
ఖమ్మం     --        40.8
మహబూబ్‌నగర్-   43.0
మెదక్‌          --       43.2
నల్గొండ     --           39.2
నిజామాబాద్‌  --       42.5
రామగుండం --        41.6

Advertisement

తప్పక చదవండి

Advertisement