అప్పుల బాధ తాళలేక... | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక...

Published Sat, Nov 28 2015 4:53 PM

The farmer commits suicide

అప్పుల బాధ తాళలేక మరో రైతన్న ప్రాణాలు విడిచాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం రాజల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ధర్మన్న (49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం 4లక్షల రూపాయలు అప్పు చేశాడు.

అది తీర్చే దారి కానరాక పోవడంతో ఈ నెల 25న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మద్యాహ్నం ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement