కవాడిగూడ: ఆదర్శ రైతు వ్యవస్థను రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలని, లే కపోతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతమవుతాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డిలు హెచ్చరించారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆదర్శ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్లో గురువారం మహా ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు హాజరయ్యారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడం రైతు లోకానికే అవమానకరమన్నారు. ఆదర్శ రైతులకు, రైతు సంక్షేమానికి నిధుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం పోలీసు వాహనాలకు రూ.340 కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదని తన క్యాంపు కార్యాలయానికి రూ.26 కోట్లు ఎలా మంజూరు చేయించుకున్నారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు.
రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. సోనియాను దేవత అని పొగిడి సన్మానం చేస్తానన్న కేసీఆర్ నేడు సానియాకు సన్మానం చేస్తున్నారని దుయ్య బట్టారు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎంతో మందిని రోడ్డున పడేయడానికి పూనుకున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీల ముద్రవేసి ఆదర్శ రైతులను తొలగించడం సరైంది కాదన్నారు.
30న కలెక్టర్ కార్యాలయాల ముట్టడి
ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ఆ సంఘాల కమిటీలు ఈ నెల 30నఅన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతు సంఘాల అధ్యక్షులు వెంకట్రెడ్డి, ఎన్.శేఖర్, ఏపీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, నాయకులు సామినేని రాము, వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే’
Published Fri, Sep 26 2014 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement