నల్లగొండ అర్బన్ :విద్యుత్శాఖకు రాబోయే మూడు నెలల కాలం అత్యంత కీలకమైందని తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ జె. రఘుమారెడ్డి అన్నారు. స్థానిక హైదరాబాద్ రోడ్డులోని విద్యుత్శాఖ అతిథిగృహంలో సోమవారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఈలు స్థానికంగా ఉండి కరెంట్ సరఫరాలో అవాంతరాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రైతులకు పరిస్థితిని వివరించి అవగాహన కల్పించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ప్రస్తుతం పంట చేతికందుతున్నందున పాత బకాయిలను వసూలు చేయాలన్నారు. వాహనాలకు మైకులు బిగించి గ్రామాల్లో విద్యుత్ బకాయిలపై ప్రచారం చేయాలన్నారు. వచ్చేది వేసవి కాబట్టి కరెంట్ సమస్యలుంటాయి, పెండింగ్ బిల్లుల వసూళ్లకు ఇబ్బంది అవుతుందన్నారు. అందువల్ల బిల్లుల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తక్కువ కలెక్షన్ చేసిన అధికారులను మందలించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో రావాల్సిన బిల్లులను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టళ్లు, నీటి సరఫరా పథకాలు మినహాయించి ఇతర అన్ని శాఖలకు బకాయిలపై నోటీసులిచ్చి వారం రోజుల అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యంపై నిఘా పెంచాలని, కేసులు నమోదు చేయాలన్నారు. కొక్యాలు (కొండ్లు) తగించి 24 గంటలు విద్యుత్ వృథా చేస్తున్న వారికి పరిస్థితులను వివరించి డీడీలు తీసుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్, వివిధ పథకాలను సమీక్షించారు. మండలాల వారీగా విద్యుత్శాఖ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాల్లో ఆర్ఏపీఆర్డీఆర్పీ పథకం ద్వారా చేపడుతున్న ఆధునిక విద్యుదీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదన్నారు. గత నెలలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అధికారి ఉదంతాన్ని గుర్తు చేశారు. సమీక్ష సమావేశం జరుగుతుండగానే ధర్మారెడ్డి కాల్వ పరిధిలోని వలిగొండ, రామన్నపేట ప్రాంతాలకు చెందిన రైతులు రెండు లారీల్లో తరలివచ్చారు. కాల్వ వెంట మోటార్లు పెట్టడం వల్ల దిగువకు నీరందించడం లేదని సాగునీరే కాకుండా, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతోందని వారు సీఎండీకి ఫిర్యాదు చేశారు. అక్రమ విద్యుత్ వాడకాన్ని నియంత్రిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంస్థ డెరైక్టర్ శ్రీనివాస్రావు, సీజెఎం పాండ్యా, శ్రీనివాస్రెడ్డి, నాగేంద్ర, ఎస్ఈ బాలస్వామి, విజిలెన్స్ సీఐ సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం
Published Tue, Dec 9 2014 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement