గజ్వేల్ : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీని ఆస్తిపన్ను హడలెత్తిస్తోంది. వివాదస్పదంగా మారిన పన్నుపెంపు వ్యవహారంపై మరో పది రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పెంపును వ్యతిరేకిస్తూ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి.. తీర్మానం ప్రతిని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు పంపింది. దీనిపై ముఖ్యమంత్రి తీసుకోనున్న తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
మరీ ఇంత దారుణంగానా?
2012 జనవరిలో గజ్వేల్.. మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్తో పాటు ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఫలితంగా పరిధి పెరిగింది. జనాభా 40 వేలకుపైగా చేరుకుంది. నగర పంచాయతీ పరిధిలో ఇళ్ల సంఖ్య 9 వేలకు పెరిగింది. నగర పంచాయతీగా మారాక పన్నుల భారం పెరుగుతుందని అందరూ ఊహించారు కానీ.. మరీ ఇంతలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందనుకోలేదు. పన్ను పెంపు సరాసరిన 200 నుంచి వెయ్యి శాతం వరకు ఉంది. దీంతో పట్టణ ప్రజలు పన్ను బాధను తలుచుకుని బెంబేలెత్తుతున్నారు. ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
ఎందుకిలా..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో నెల క్రితం వరకు మేజర్ పంచాయతీగా ఉన్న కాలం నాటి ‘క్యాపిటల్ వాల్యూ మెథడ్’ పన్నుల విధానమే అమలైంది. దీని ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విలువపై 5 నుంచి 10 శాతం పన్నులు వసూలు చేసేవారు. దీంతో భారం తక్కువుండేది. తాజాగా ‘మంత్లీ రెంటల్’ విధానంలో పన్నుల వసూలు జరగనున్నది. దీని ప్రకారం ఓ భవనంలో గదుల సంఖ్య, వాటి వైశాల్యం, ఆ గదికి వచ్చే నెలసరి అద్దె ఆధారంగా పన్ను వడ్డిస్తారు.
ఇక, వాణిజ్య సముదాయాలపై పన్ను పెంపు గతంతో పోలిస్తే వెయ్యి శాతానికిపైగా ఉండబోతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీలు మేజర్ నుంచి నగర పంచాయతీలుగా అప్గ్రేడైన కారణంగా.. వాటిల్లో కొత్త పన్నుల విధానం ఉండాలనే ఆలోచనతో ఈ పెంపు నిర్ణయం అమల్లోకి రానున్నది. అయితే, రాష్ట్రంలోని 43 మున్సిపాలిటీల్లో మాత్రం 2002 నాటి పన్నుల విధానమే అమల్లో ఉంది.
కొత్త విధానంలో వడ్డింపులిలా..
కొత్త పన్ను విధానంలో నగర పంచాయతీని 4 జోన్లుగా విభజించి.. ఆస్తుల విలువను బట్టి పన్నులు నిర్ధారించారు. ఉదాహరణకు మొదటి జోన్లో ఇంటికి సెల్లార్, జీ ప్లస్-1, రెండు, మూడు ఫ్లోర్లకు ఒక చదరపు మీటర్కు గతంలో రూ.2-రూ.4 చొప్పున పన్ను వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ.10కి చేరుకుంది. అంటే పెరుగుదల 200 శాతం పైమాటే. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నర్సింగ్హోంలు, గోదాములు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, లాడ్జిలు, రెస్టారెంట్లు, కమ్యునిటీ హాల్లు, ఆడిటోరియం, పెట్రోల్బంక్, సెల్టవర్స్ వంటి వ్యాపార, వాణిజ్య భవనాలపై వెయ్యి శాతానికిపైగా పెంపు ఉండనుంది.
కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి మున్సిపల్ పరిపాలన కమిషనరేట్కు పంపింది. ఈ ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనుంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పెంపా? తగ్గింపా? అనేది తేలనుంది.
ఊరటా? పన్నుపోటా?
Published Fri, Aug 28 2015 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement