పెళ్లికి చెప్పేందుకు వెళ్లి.. | Sakshi
Sakshi News home page

పెళ్లికి చెప్పేందుకు వెళ్లి..

Published Thu, Oct 2 2014 3:34 AM

పెళ్లికి చెప్పేందుకు వెళ్లి..

కొడంగల్ రూరల్: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇరువురి పెద్దలను ఒప్పించాడు ఆ యువకుడు. వివాహ  ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. పెళ్లికి రమ్మని ఆహ్వానించేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారాడు. ఈ హృదయవిదారకర సంఘటన మంగళవారం రాత్రి బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామశివారులో చో టుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. కొడంగల్ పట్టణానికి చెందిన జెటుకల రమేష్ ఉరఫ్ కన్నయ్య(22) సమీప కాలనీకి చెందిన ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నా డు. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు, పంచాయితీ పెట్టి పెళ్లికి నిశ్చయించారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల సమీపంలో ఉన్న పాంబండలోని రామస్వామి దేవాలయంలో ఈ నెల 1వ తేదీన(బుధవారం) వివాహ ఏర్పాట్లుచేశారు. ఇదిలాఉండగా, ప్రే మ వివాహం విషయంలో యువతి సోదరుడితో పాటు కుటుంబసభ్యుల కు ఇష్టంలేకపోవడంతో సదరు యువతిని పక్షం రోజులుగా రమేష్ తన అక్క వద్ద బొంరాస్‌పేట మండలం కొండాయిపల్లి గ్రామంలో ఉంచాడు. పెళ్లికి రావాల్సిందిగా సమీప బంధువులకు చెప్పడానికి మంగళవారం రాత్రి తన బైక్‌పై బయలుదేరాడు.
 దాడిచేస్తున్నారని ఫోన్..!
 తనను నలుగురు వ్యక్తులు హకీంపేట దారిలో వెంబడించి దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నారని రాత్రి 9 గంటల ప్రాంతంలో రమేష్ తన కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి చెప్పాడు. ఆ తరువాత ఎన్నిమార్లు ఫోన్‌చేసినా స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. ఆందోళనకు గురైన రమేష్ తండ్రి మల్లప్పతోపాటు మరికొందరు వెళ్లి వెతకగా.. లగచర్ల- హకీంపేట దారిలో రోడ్డు పక్కగా బైక్ ఆపిఉంది. రమేష్ సృహతప్పి పడిఉండడాన్ని గమనించి హుటాహుటి న అంబులెన్స్‌లో కోస్గి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి..అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేష్‌ను కొట్టి హత్యచేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వప్రసాద్ తెలిపారు.




 

Advertisement

తప్పక చదవండి

Advertisement