తలకొండపల్లి: చోరీ ఘటన సినిమా సీన్ను తలపించింది.. క్రేన్ సహాయంతో ఓ భారీ వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే క్రేన్ బురదలో కూరుకుపోవడంతో ప్రయత్నం బెడిసి విగ్రహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన సోమవారం మండలంలోని వెల్జాల్ గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామశివారులోని వెంకాయకుంటలో ఆరుబయట అతిపురాతన వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి అత్యంత పవిత్రత ఉందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢనమ్మకం. కోరినకోర్కెలుతీర్చే దేవుడిగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అయితే ఇంతటి విశిష్టత కలిగిన వినాయకుడి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లేందుకు పథకం రచించారు. ఆదివారం అర్ధరాత్రి క్రేన్తో వెంకాయకుంటకు చేరుకున్నారు. విగ్రహాన్ని ట్రక్కు, లారీ, తదితర వాహనాల్లో వేయడానికి యత్నించారు. కొద్దిదూరం పాటు విగ్రహాన్ని క్రేన్సాయంతో కదిలిం చారు. లారీలో వేస్తుండగా క్రేన్ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో దుండగులు విగ్రహంతో పాటు క్రేన్ను అక్కడే వదిలిపారిపోయారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కొందరు క్రేన్ను గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఆమనగల్లు సీఐ వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు మహేందర్, శ్రీనివాసులు, సాయికుమార్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు ఆరాతీరు.
గ్రామస్తుల ఆందోళన
క్రేన్ను అక్కడినుంచి తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్తులు క్రేన్ను ఎక్కడికీ తరలించొద్దని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యజమాని ఇక్కడికి రావాలని, విగ్రహం చోరీ వివరాలను వెల్లడించాలని పట్టుబట్టారు. పోలీస్లు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు కొద్దిసేపు వా గ్వాదం కొనసాగింది. విషయం తెలుసుకున్న మాజీ ఏంపీపీ శ్రీనివాస్యాదవ్తో పాటు తహశీల్దార్ జ్యోతిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వినాయకుడి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టింపజేస్తామని ఇరువర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న క్రేన్సాయంతో పూర్వస్థానంలో ఉంచారు. విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకపూజలు జరిపారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. క్రేన్ను సీజ్చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
క్రేన్ తో దొంగతనానికి వచ్చి..
Published Tue, Jun 23 2015 9:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement