ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, ఎలాంటి సందేహాలు లేకుండా కుటుంబం పూర్తి వివరాలు ఎన్యూమరేటర్కు చెప్పాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా ప్రజలను కోరారు. పూర్తి వివరాలు తెలిస్తేనే ఎంత మంది ప్రజలు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు.
సోమవారం ఆదిలాబాద్లో జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లబ్ధి పొందిన వివరాలు చెబితే తమకు వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని, సంక్షేమ పథకాల కోసం మేం పెట్టుకున్నవన్నీ రద్దు అవుతాయని ప్రజలు అనుకోవద్దని తెలిపారు. మేం వివరాలు చెబితే మాకు రుణ మాఫీ కాదేమోనని, సంక్షేమ పథకాలు వర్తించవోనని అనుకోకూడదని అన్నారు.
కుటుంబ సర్వేకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కుటుంబ వివరాలతో పాటు స్థిరాస్తులు, చరాస్తులు అన్ని వివరాలు సమగ్రంగా తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. జనాభా ఎంత ఉంది, పథకాల లబ్ధి చేకూరుతుందా లేదా తదితర వివరాలు తెలుసుకునేందుకే సర్వే చేనపడుతున్నట్లు తెలిపారు. 19న అందరు ఇంట్లోనే ఉండి వివరాలు తెలుపాలని కోరారు.
సర్వేపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కరపత్రాలు ముద్రించుకొని వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఈ సదస్సుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి హాజరుకాకపోగా, ఇతర ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. కలెక్టర్ జగన్మోహన్, సీపీవో షేక్మీరా, డీపీవో పోచయ్య, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, దివాకర్రావు, జెడ్పీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేకు.. పథకాలకు సంబంధం లేదు
Published Tue, Aug 12 2014 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement