జేడీఏ కార్యాలయంలో రూ.3 కోట్లు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్
సంగారెడ్డి రూరల్: మెదక్ జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి డబ్బులు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్టకేలకు దొరికాడు. సంతకాలు ఫోర్జరీ చేసి రూ.3.35 కోట్లు కాజేసిన మానయ్య అలియాస్ మాణిక్యం (29)ను సంగారెడ్డి రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ తిరుపతన్న కేసు వివరాలను విలేకరులకు వివరించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ మానయ్య రూ.3 కోట్లకుపైగా అక్రమం గా డబ్బులు డ్రా చేశారని జేడీఏ హుక్యానాయక్ గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా ఆఫీసులో డేటా ఎం ట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న శంకర్పల్లి మం డలం లక్ష్మీరెడ్డిగూడెంకు చెందిన మానయ్య జేడీఏ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్కేబీవై పథకానికి చెందిన రూ.కోటికి పైగా, ఎన్ ఎఫ్ఎస్ఎం నుంచి రూ. 2 కోట్లకు పైగా డ్రా చేశాడు.
జాతకం మార్చిన ఫోన్కాల్: ‘షెవర్ల్లెట్ కంపె నీ నుంచి రూ.7 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బు పొందాలంటే రూ.3.50కోట్లను తాము సూచించిన అకౌంట్లలో జమ చేయాలి’ అని మానయ్య ఫోన్కు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో మానయ్య.. తాను పని చేస్తున్న కార్యాలయం నుంచి డబ్బులను డ్రా చేసి సదరు కంపెనీ అకౌంట్కు పంపించాడు. ఈ క్రమం లో ఓ బ్యాంక్ కర్ల్క్కు అనుమానం వచ్చి జేడీఏ హుక్యానాయక్కు లేఖ రాయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ఇతర సిబ్బంది ప్రమేయం ఉందా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్ఎంఎస్లను రిసీవ్ చేసుకొనే వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల లో డబ్బు ఆన్లైన్ ద్వారా అక్రమంగా డ్రా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
‘ఇంటిదొంగ’ గుట్టురట్టు
Published Wed, Feb 24 2016 3:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement