బ్యాంక్‌లో దొంగలు పడ్డారు | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌లో దొంగలు పడ్డారు

Published Wed, Aug 23 2017 3:02 AM

బ్యాంక్‌లో దొంగలు పడ్డారు

రూ.10 నాణేల అపహరణ
 
సిద్దిపేట రూరల్‌: పట్టణంలోని లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో మంగళవారం దొంగలు పడ్డారు. బ్యాంకు భవనం వెనుక గోడను తవ్వి లోనికి చొరబడ్డారు. లాకర్లు తెరిచేందుకు యత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు బ్యాంక్‌ వెనుక గోడకు రంధ్రాన్ని చేసి లోనికి ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. సైరన్‌ను పగులగొట్టారు. అయితే, లాకర్‌ను తీసే ప్రయత్నంలో విఫలమయ్యారు.

అంతలో బ్యాంకు లోపలి నుంచి పెద్దగా శబ్దం రావడంతో పక్కనే ఫర్నిచర్‌ షాపులో నిద్రిస్తున్న వ్యక్తి లేచాడు. అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. మరోపక్క లాకర్‌ తెరుచుకోక పోవడంతో దొంగలు బీరువాలో ఉంచిన రూ.97 వేలు  విలువ చేసే రూ.10 నాణేలను అపహరించు కుపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement