సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతుంది. మోదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అనంతరం గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులతో కలసి మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు చేరుకుంటారు.
అక్కడ సంప్రదాయ స్వాగతం అనంతరం భగీరథ పైలాన్ ఆవిష్కరించి, ఇంటింటికీ నల్లా నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత భగీరథపై ప్రత్యేక ప్రదర్శనను వీక్షించి, సమీపంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సభా ప్రాంగణంలోనే శంకుస్థాపన చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీకి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన చేయడంతో పాటు 1,200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్ను జాతికి అంకితం చేస్తారు.
వేదికపై 20 మంది ప్రముఖులు
ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.25 గంటలకు సభా వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ప్రధానితో పాటు గవర్నర్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలసి 20 మంది ప్రముఖులు కూర్చుంటారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్వాగతోపన్యాసం, కేసీఆర్ ప్రసంగం అనంతరం ప్రధాని మాట్లాడతారు. వేదికపై ప్రముఖులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ధన్యవాదాలు తెలుపుతారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ సభా స్థలి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
Published Sat, Aug 6 2016 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement