పెద్దాపూర్ వద్ద కారు - ఆటో ఢీకొనడంతో ఘటన
పోతిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు
పది నిమిషాలైతే గూటికి చేరేవారు
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
పోతిరెడ్డిపల్లిలో విషాదఛాయలు
సంగారెడ్డి క్రైం : అంత్యక్రియలకు వెళ్తున్న వారికి అదే అంతిమయాత్ర అవుతుందనుకోలేదు వారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారిని కారు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది. బంధువు చివరి చూపు కోసం వెళ్లిన వారికి అదే చివరి రోజైంది.
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేకిందర్ సావిత్రి (60) కుటుంబానికి చెందిన ఒకరు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం మాదారంలో చనిపోగా అతడి అంత్యక్రియలకు రేకిందర్ సావిత్రమ్మ, ఆమె కుమారుడు రేకిందర్ జనార్దన్, రెండో కుమారుడు కోటయ్య భార్య సుజాతలతో పాటు మరో నలుగురు ఆటోలో బుధవారం ఉదయం బయలుదేరారు. కార్యక్రమం పూర్తిచేసుకుని సాయంత్రం వారు సంగారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కారు ఢీకొనగా సావిత్రి, జనార్దన్, సుజాతలు మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్తో సహా మరో నలుగురు గాయపడ్డారు.
కాగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే వారు మృత్యువాత పడడంతో గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీవాసులంతా కన్నీరు పెట్టారు. మృతుడు జనార్దన్కు భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అనాథలైన పిల్లలు : రోడ్డు ప్రమాదంలో సుజాత మృతి చెందగా ఆమె భర్త కోటయ్య గత కొన్ని నెలల క్రితం ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి పిల్లలు సాయి, శ్రీకాంత్, శ్రుతిలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కొన్ని నెలల క్రితం తండ్రి కోటయ్యను కోల్పోయిన పిల్లలు తాజాగా తల్లి కూడా మరణించిందన్న విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. పిల్లల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దలంతా మృత్యువాత పడడంతో ఆ కుటుంబమంతా రోడ్డున పడింది.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ...ముగ్గురి మృత్యువాత
Published Fri, May 8 2015 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement